మిర్యాలగూడ అభివృద్ధికి సహకరిస్తా..

19-04-2024 12:39:06 AM

l నల్లగొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘువీర్‌రెడ్డి

నల్లగొండ, ఏప్రిల్ 18 (విజయక్రాంతి) : తనను గెలిపిస్తే మిర్యాలగూడ అభివృద్ధికి సహకరిస్తానని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుం దూరు రఘువీర్‌రెడ్డి అన్నారు. గురువారం ఉదయం ఆయన మిర్యాలగూడలో పర్యటించారు. ఉదయం ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఎన్నెస్పీ మైదానంలో మార్నింగ్ వాకర్లను కలిసి ముచ్చటించారు. తన తండ్రి జానారెడ్డి చేసిన అభివృద్ది వివరించారు. యువకుడిగా పార్లమెంటులో మిర్యాలగూ డ సమస్యలను వివరించి రైల్వేలు, భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ), టెలికం సమస్యలు, విస్తరణ అంశాలు దృష్టికి తీసుకవచ్చి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. వంద రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల్లో భాగంగా పలు సంక్షేమ పథకాల అమలును వివరించారు. రఘువీర్ వెంట మిర్యాలగూ డ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, నూకల వేణుగోపాల్ రెడ్డి, సొనబోయిన శ్రీనివాస్ యాదవ్, పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.