26-06-2025 12:00:00 AM
నటుడు మంచు విష్ణుకు చెందిన కార్యాలయాల్లో కేంద్ర జీఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగం బుధవారం రాత్రి ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. మాదాపూర్, కావూరి హిల్స్లో ఉన్న విష్ణు ఆఫీసుల్లో రెండు బృందాలు తనిఖీలు జరిపాయి.
తాజాగా నిర్మించిన ‘కన్నప్ప’ సినిమాకు సంబంధించి జీఎస్టీ చెల్లింపుల్లో తేడా ఉన్నట్టు అనుమానం రావటంతోనే అధికారులు.. ఇందుకు సంబంధించి రికార్డులను పరిశీలించారు. తనిఖీల నేపథ్యంలో మోహన్బాబు.. విష్ణు కార్యాలయానికి చేరుకున్నారు. ఈ తనిఖీల విషయమై విష్ణు స్పందిస్తూ.. ‘దాచిపెట్టేదేమీ లేదు.. ఎక్కడెక్కడ అప్పులు చేశామో తెలుస్తుంది’ అన్నారు.