28 July, 2026 | 1:48 PM

Breaking News

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన కేటీఆర్   •   మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం   •   తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వస్తుంది   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి   •   నూతనంగా నిర్మించిన ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణులను కేటాయించండి   •   విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జి.. సెట్ విచారణకు సుప్రీం ఆదేశం   •   లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా   •   పావలా శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న 'మా' అసోసియేషన్   •   భాగ్యనగర్ తండా సబ్‌స్టేషన్ సమస్య పరిష్కరించాలి   •   విజయ క్రాంతి ఎఫెక్ట్... రైతు వేదిక పరిశుభ్రం   •  

పోలీసుల ఆధ్వర్యంలో అర్థరాత్రి ముమ్మర తనిఖీలు

26-05-2026 03:38 PM

మఠంపల్లి మే 26(విజయక్రాంతి): మండల పరిధిలోని భీమ్లా తండా గ్రామంలో ఎస్సై ప్రవీణ్ కుమార్(SI Praveen Kumar) పోలీసు సిబ్బందితో కలిసి సోమవారం అర్ధ రాత్రి వేళ ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు భద్రత కల్పించడమే లక్ష్యంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.అనంతరం గ్రామస్తులకు భద్రత తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ప్రజలకు భద్రత కల్పించడంలో పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని ఏవైనా సమస్యలు ఉంటే సామరస్యంగా లేదా చట్టపరంగా పరిష్కరించుకోవాలని ప్రజలకు సూచించారు.

భూ తగాదాల విషయంలో భౌతిక దాడులకు పాల్పడకుండా పెద్దల సమక్షంలో,కోర్టుల ద్వారా పరిష్కారం పొందాలని కోరారు.గ్రామాల్లోకి అనుమానిత వ్యక్తులు ప్రవేశిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. వ్యవసాయ సీజన్ ప్రారంభం కావడంతో రైతులు నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని,మధ్యవర్తుల వద్ద విత్తనాలు కొని మోసపోవద్దని సూచించారు.అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100కు ఫోన్ చేస్తే ఇంటి వద్దకే వచ్చి పోలీసింగ్ సేవలు అందిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాగు నాయక్,ఉప సర్పంచ్ జామ నాయక్, వార్డ్ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.