23-06-2025 12:16:05 AM
రాజేంద్రనగర్, జూన్ 22 : ఓ ఇంటర్ బాలుడు ప్రమాదవశాత్తు క్వారీ గుంతలో మునిగి మృతి చెందిన సంఘటన శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని బో రబండ కు చెందిన మీర్జా షోయెబ్ బేగ్ (17) స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడతానని ఇం ట్లో చెప్పి బయలుదేరాడు. తన 11 మంది స్నేహితులతో కలిసి ఫోటోషూట్ కోసం శం షాబాద్ సమీపంలోని క్వారీల వద్దకు చేరుకున్నాడు.
ఉదయం ఎనిమిది గంటల సమ యంలో అతడు ప్రమాదవశాత్తు వారిలో పడి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు స్నేహితులు కాల్ చేసి చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్లు, ఫైర్ సిబ్బంది, ఎన్డిఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి అతి కష్టం మీద మృతదేహాన్ని వెలికి తీశారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కు టుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తుచేస్తున్నారు.