18 April, 2026 | 9:00 AM

ఈకేవైసీ చేయించండి పీఎం కిసాన్ పొందండి

23-06-2025 12:16 AM

హన్వాడ జూన్ 22 : రైతులందరూ ఈకేవైస్ చేయించి పీఎం కిసాన్ పొందాలని ఏఈఓ గోవింద్ అన్నారు. ఆదివారం హన్వా డ మండలంలోని పెద్దదర్పల్లి గ్రామంలో ఈ కేవైసీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాల నుంచి వచ్చే పథకాలను లబ్ధి పొందేందుకు అమలు చేస్తున్న నియమ నిబంధనలను పాటించాల్సిన అవసరం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు రఘురాం గౌడ్, తదితరులు ఉన్నారు.