calender_icon.png 23 June, 2025 | 7:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏకగ్రీవంగా ఏ నరేందర్ ఎన్నిక

23-06-2025 12:17:57 AM

- నరేందర్‌కు అభినందనల వెల్లువ

మహబూబ్ నగర్ టౌన్ జూన్ 22 : ప్రభుత్వ నాల్గవ తరగతి ఉద్యోగుల సహకార గృహ నిర్మాణ సంఘం ల మహబూబ్ నగ ర్ జిల్లా అధ్యక్షునిగా ఏ.నరేందర్ ఏకగ్రీవ ఎన్నికయ్యారు. ఈ సంఘం జిల్లా కు జరిగిన ఎన్నికల్లో అధ్యక్షునిగా  కార్యవర్గ సభ్యులు నుండి ఒక్కరే నామినేషన్ వేయడం తో ఏ నరేందర్ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది.

మేరకు ఉపాధ్యక్షునిగా పి. రఘురాం,కార్యదర్శిగా తిరుమల గిరి రా మకృష్ణ,కోశాధికారిగా టి. రాజ శేఖర్,డైరెక్టర్ లుగా ఎల్లమ్మ,జి.అన్నపూర్ణ,భాగ్యలక్ష్మి, కె. మౌనిక,జి.రాజు లు ఏకగ్రీవంగా ఎన్నిక అయినట్లు ఎన్నికల అధికారి,సహకార శాఖ అసిస్టెంట్ రిజిస్ట్రార్  బి.రాజ శేఖర్ ప్రకటించారు.

ఈ కార్యవర్గం ఐదేళ్లపాటు కొన సాగుతుందని సంఘం బాధ్యులు తెలిపారు. నాపై నమ్మకం ఉంచి ఏకగ్రీవంగా ఎన్నిక చేసినందుకుగాను ప్రతి ఒక్కరికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటే సేవ చేసుకుంటారని సంఘం అధ్యక్షులు నరేందర్ తెలియజేశారు.