8 June, 2026 | 7:35 PM

Breaking News

పారా క్రీడాకారులకు రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి   •   ఘనంగా గోపూజ, అన్నదానం   •   జైనూర్ గ్రామ సభలో అభివృద్ధి ప్రణాళికలపై చర్చ   •   నీట్ (యూజీ)-2026 పునఃపరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   10న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాను విజయవంతం చేయండి: కళ్లెం కృష్ణ   •   ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి   •   సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తా   •   జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేద్దాం   •   ఈనెల 10న సిద్ధాపూర్ కు మంత్రి ఉత్తమ్ రాక   •   విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి   •  

ఉరి వేసుకొని విద్యార్థి ఆత్మహత్య

03-11-2024 07:40 PM

మేడ్చల్,(విజయక్రాంతి): ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పట్టణంలోని కేఎల్ఆర్ కాలనీకి చెందిన కోట్ల సూర్యనారాయణ కుమారుడు అవినాష్(16) కొంపల్లిలో హాస్టల్ లో ఉంటూ ఆంటోనీ కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. దీపావళి పండుగకు అవినాష్ ఇంటికి వచ్చాడు. ఇంట్లో ఎవరు లేని సమయంలో యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటికి తిరిగి వచ్చిన మృతుడి కుటుంబ సభ్యులు అవినాష్ ను చూసి బోరుమని ఏడిచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. అవినాష్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని చెప్పారు. తండ్రి సూర్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.