13 May, 2026 | 2:10 AM

ఇంటర్ సీట్లకోసం ఆందోళన

04-05-2024 12:05 AM

అడ్మిషన్స్ కోసం ప్రభుత్వం నోటిఫికేషనైనా విడుదల చేయక ముందే అప్పుడే ఆయా ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలల్లో సీట్లు నిండి పోయాయంటూ ఇవాళ వచ్చిన వార్త ఈ ఏడాది ఇంటర్మీడియట్ చదువాలనుకొనే విద్యార్థులను ఆందోళనకు గురి చేస్తున్న ది. రిజిస్ట్రేషన్, ట్యూషన్ ఫీజుల పేరిట వేలు, లక్షల రూపాయలు డిమాండ్ చేయడం మరో ఆందోళనకర విషయం. టెన్త్ పరీక్షల ఫలితాలు వచ్చిన కొద్ది రోజులకే అడ్మిషన్లు పూర్తయినాయంటూ వార్తలు వచ్చాయంటే, ఖచ్చితంగా యాజమాన్యాలు అధిక ఫీజు లు రాబట్టుకునేందుకే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

 అనురాగ్ కేశవ్, సిద్దిపేట