calender_icon.png 18 June, 2025 | 4:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణి ఏరియాలో అంతర్జాతీయ యోగా శిక్షణ

18-06-2025 12:30:24 AM

 కొత్తగూడెం, జూన్ 17, (విజయక్రాంతి); ఈనెల జూన్ 21 వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని, భారత ప్రభుత్వము, కేంద్ర బొగ్గు మంత్రిత్వ శా ఖ ఆదేశాల మేరకు,కోల్ ఇండియా అనుబం ధ బొగ్గు సంస్థల నందు ఈనెల14 నుంచి. 20వ తేదీ వరకు నిర్వహించే,యోగా బూట్ క్యాంపుల నిర్వహణ లో భాగముగా మంగళవారం కొత్తగూడెం ఏరియా జిఎం కార్యాలయంలో నిర్వహించిన యోగా శిక్షణ కు ముఖ్యఅతిథిగా కొత్తగూడెం ఏరియా ఎస్ ఓటు జిఎం జి.వి కోటి రెడ్డి హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, యోగా వలన మనసు శరీ రం ప్రశాంతంగా ఉంటుందని,ప్రతి ఒక్కరు యోగాను చేస్తూ వారి ఆరోగ్యాలను కాపాడుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమము లో ఎస్‌ఓ టు జి ఎం తో పాటు కొత్తగూడెం ఏరియా ఏఐటియుసి బ్రాంచ్ సెక్రటరీ వీ మల్లికార్జునరావు ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్, డిజిఎం గామలపాటి వెంకట మోహన్ రావు, డివై పిఎం గోవర్ధన హరీష్, సీనియర్ పిఓలు మజ్జి.మురళి, మొ హామ్మద్ మాథీన్ హుస్త్స్రన్, ఐటీ మేనేజర్ కె శేషాశ్రీ, అధికారులు టి. సత్యనారాయణ, బి తౌర్య,  బి మాధవ్ ఇతర అధికారులు ఉద్యోగులు పాల్గొన్నారు.