బోధన్ విద్యుత్ సరఫరాలో అంతరాయం
08-08-2026 12:00 AM
బోధన్ ఆగస్టు 7 (విజయ క్రాంతి): బోధన్ సబ్స్టేషన్ మెయింటెనెన్స్ పనుల కారణంగా బోధన్ పట్టణంలోని 33/11 కేవీ పరిధిలోని అన్ని కాలనీల్లో శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ నాయిని కృష్ణ తెలిపారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సరఫరా నిలిపివేస్తామని పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.






