12-12-2025 02:20:03 AM
మహాసభలకు, బిజినెస్ సెమినార్కు హాజరుకావాలని విజ్ఞప్తి
హైదరాబాద్, డిసెంబర్ 11 (విజయక్రాంతి): అమెరికన్ తెలు గు అసోసియేషన్ (ఆటా) 19వ మహాసభలు యువజన సద స్సు అమెరికాలోని బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్నారు. ఈ మహాసభలకు ముఖ్యఅతిథిగా హాజరుకావాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబును గురువారం ఆటా అధ్యక్షుడు జ యంత్ చల్లా, ఎలెక్ట్ ప్రెసిడెంట్ సతీశ్రెడ్డి, మీడియా కో ఆర్డినేటర్ ఈశ్వర్ బండా మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు.
రెం డు తెలుగు రాష్ట్రాల్లో ఆటా చేపడుతున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా డిసెంబర్ 19న హైదరాబాద్ టీ-హబ్లో నిర్వహించనున్న బిజినెస్ సెమినార్కు కూడా ముఖ్యఅతిథిగా హాజరుకావాలని మంత్రి శ్రీధర్బా బును కోరారు. ఈ సమావేశంలో అమెరికా- తెలంగాణ మధ్య వ్యాపార, సాం కేతిక, స్టార్టప్ రంగాల అనుబంధాన్ని బలోపేతం చేయడానికి ఆటా చేస్తున్న ప్రయత్నాలను వివరించారు. ఆటా మహాసభల్లో అమెరికాలోని ప్రవాస తెలుగు సమాజం, వ్యాపారవేత్తలు, యు వ ఇన్నోవేటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారని నిర్వాహకులు మంత్రికి తెలిపారు.