11-06-2025 11:47:43 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) గార్ల మండల ఇరిగేషన్ శాఖ ఏఈ గా విధులు నిర్వహిస్తున్న దేవిలాల్(33) క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని బయ్యారం ఎస్సై తిరుపతి(SI Tirupati) తెలిపారు. గార్లలో ఏఈ గా విధులు నిర్వహిస్తున్న దేవిలాల్ బయ్యారంలో అద్దె కుంటున్నాడని, మంగళవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడగా గమనించిన ఇంటి పక్కన ఉన్నవారు అతని తోలుత మహబూబాబాద్ ఆ తర్వాత పరిస్థితి విషమంగా మారడంతో హైదరాబాద్ తరలిస్తుండగా బుధవారం మరణించాడని ఎస్ఐ తెలిపారు. మృతదేహాన్ని మిరియాల పెంట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచామని, అతని స్వస్థలం నల్గొండ జిల్లా అని, ఫిర్యాదు ఇంకా అందలేదని ఎస్సై తెలిపారు.