calender_icon.png 28 June, 2025 | 5:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మునుగోడు ప్రాంతానికి సాగునీరు అందించాలి

28-06-2025 12:30:28 AM

సీపీఐ జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకట్ రెడ్డి

సంస్థాన్ నారాయణపూర్, జూన్ 27 (విజయక్రాంతి): రాచకొండలో రిజర్వాయర్ ఏర్పాటుచేసి  చర్లగూడెం ప్రాజెక్టు నుండి లిఫ్ట్ ద్వారా మునుగోడు ప్రాంతం, సంస్థాన్ నారాయణపురం, చౌటుప్పల్ మండలాలకు సాగునీరు అందించాలని సిపిఐ జాతీయ సభ్యులు పల్లా వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. యాదాద్రిభువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో నిర్వహించిన మహా సభకుఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములుతో కలిసి పల్లా వెంకటరెడ్డి ముఖ్య అతిదులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ లెఫ్ట్ పార్టీలు కలిసి ఒకే జెండా ఒకే గుర్తుతో ముందుకు పోవాలని అభిప్రాయపడ్డారు.కమ్యూనిస్టులు ఐక్యం ఐతే ప్రజలంతా మన వైపు ఉండే అవకాశం ఉందని అన్నారు.ప్రపంచ దేశాలలో కమ్యూనిస్టులే కీలంకంగా ఉన్నారని గుర్తు చేశారు.ఆయుధాలు వదిలి నక్సలైట్లు  జనంలోకి వచ్చి పోరాడాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గానికి సాగునీరు అందించే శివన్నగూడెం ప్రాజెక్టును పూర్తిచేసి సంస్థాన్ నారాయణపురం చౌటుప్పల్ మండలాలకు కృష్ణ సాగునీటిని అందించాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చే బాధ్యత ఆ ప్రభుత్వంపై ఉందని,ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే  ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు.   ఈ మహాసభలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బచ్చనగోని గాలయ్య, యానాల దామోదర్ రెడ్డి,బొల్లమోని సత్యనారాయణ, మండల కార్యదర్శి దుబ్బాక భాస్కర్, ఏఐటీయుసీ జిల్లా కార్యదర్శి ఇమ్రాన్,మండల సహాయ కార్యదర్శులు చిలువేరు అంజయ్య, పొట్ట శంకరయ్య, కలకొండ సంజీవ, నాయకులు జగన్, కందుల లింగమ్మ, దేశిడి నరేందర్ రెడ్డి, రుద్ర రాములు, పల్లె మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.