12-06-2025 12:09:56 AM
హుజురాబాద్,జూన్11: (విజయ క్రాంతి) రాష్ట్ర ప్రభుత్వం కుంటలు చెరువులు కాపాడేందుకు హైడ్రా పేరుతో ప్రత్యేక వింగు ను ఏర్పాటు చేసింది. అయినప్పటికీ పట్టణాల లో పల్లెల్లో కుంటలు, చెరువులు కబ్జాకు గురవుతునే ఉన్నాయి. కరీంనగర్ జిల్లా హుజరా బాద్ పట్టణ శివారులోని రంగనాయకుల గుట్ట సమీపంలో 27 గుంటల విస్తీర్ణం గల గంగ రేణికుంంట కబ్జా దారుల చేతులకు వెళ్లనుందా? కుంట పక్కనే ఉన్నవారు జ రుపుకుంటూ వస్తూనే ఉన్నారు. ఇప్పటివరకు పట్టించుకున్న నాధుడే కరువయ్యాడని స్థానికులు అంటున్నారు.
పూర్వం గంగా రేణికుంటకు హుజురాబాద్ మండలం పెద్ద పాపాయ పల్లి గ్రామం లోని మూలకుంట వాగు నుండి కాలువ ద్వారా నీరు చేరేదని తెలిపారు. ఈ కుంటకింద సుమారుగా 150 ఎకరాలకు పారకం ఉండేదని, వ్యవసాయ బవులలో నిత్యం నీరు నిండికుండలా ఉండేవని , కాలువ కనుమరుగు కావడంతో కుంటలోకి నీరు చేరక ఎండిపోతుందని తెలిపారు.
ఈ కుంట నుండి చిలకా వాగులోకి నీరు చేరేదని. ఇది పూర్తిగా కబ్జా కావడంతో ఎండిపోయి పిచ్చి చెట్లు వేపుగా పెరిగాయి. మూడు రోజుల క్రితం కబ్జాదారులు పొలం చదును పేరుతో కుంటను సైతం చదును చేశారని తెలిపారు. వెంటనే అధికారులు స్పందించి కబ్జాకార్లపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుకుంటున్నారు.
కబ్జాదారుల పై చర్యలు తీసుకుంటాం
చెరువులు వాగులు కుంటలు కబ్జా చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హుజురాబాద్ ఎమ్మార్వో కనకయ్య అన్నారు. చెరు వులో కుంటలు వాగులు సర్వే చేయించి వాటికి హద్దులు ఏర్పాటు చేస్తాం.
తహసీల్దార్ కనకయ్య