11-06-2025 06:01:44 PM
హైదరాబాద్: ఎరువుల కంపెనీ ప్రతినిధులతో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Agriculture Minister Tummala Nageswara Rao) సమీక్షించారు. సాగు సీజన్ లో అవసరమయ్యే ఎరువుల లభ్యతపై, తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన కోటా ప్రకారం ఎరువుల పంపిణీపై సమీక్ష నిర్వహించారు. కేటాయించిన లక్ష్యం కన్నా తక్కువ సరఫరా చేసిన కంపెనీల ప్రతినిధులపై మంత్రి తుమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్కువగా సరాఫరా చేసిన ఎరువులను జులైలోగా అందించాలని మంత్రి కోరారు. అన్ని మండలాల్లో రైతుల అవసరాల తగ్గట్టుగా ఎరువులు అందుబాటులో ఉంచుకోవాలని, జిల్లా వారిగా కేటాయించిన ఎరువులను ఆ జిల్లాలోనే పంపిణీ చేసేలా కంపెనీల జాగ్రత్తలు తీసుకోవాలని తుమ్మల సూచించారు. కల్తీ విత్తనాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశాలు జారీ చేశారు.