12-06-2025 12:57:48 AM
దేశానికే ఆదర్శంగా ఆలయం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం: రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి
గద్వాల, జూన్ 11 ( విజయక్రాంతి ) : శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానాన్ని పునః వైభవంతో తీర్చిదిద్దేందుకు అన్ని విభాగాల్లో సమగ్ర అభివృద్ధి చేపట్టాలని దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి శైల జ రామయ్యర్ అధికారులను ఆదేశించారు.
బుధవారం అలంపూర్ ప్రసాద్ పథకం బిల్డింగ్ లోని జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ అధ్యక్షతన జోగులాంబ దేవస్థానం అభివృ ద్ధి కొరకు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి, అభివృద్ధి కమిటీ సభ్యుల తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించి, శా ఖల వారీగా చర్యాచరణ ప్రణాళికలు,అభివృద్ధి కార్యక్రమాలు,ఖర్చు అంచనాలపై స మగ్రమైన చర్చ జరిపారు. ముందుగా ఆల యంలో ఆమె ప్రత్యేక పూజ కార్యక్రమం ను నిర్వహించారు.
ఈ సందర్భంగా దేవాదాయ శాఖ ప్రధా న కార్యదర్శి శైలజ రామయ్యర్ మాట్లాడుతూ,అలంపూర్ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం5వ శక్తిపీఠంగా ప్రత్యేక ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థానం కలి గి ఉందని , ఈ పవిత్ర క్షేత్రాన్ని పునర్వైభవం తో అభివృద్ధి చేయడం అత్యవసరమని భా వించి, ప్రభుత్వం ఇందుకోసం సమగ్ర మా స్టర్ ప్లాన్ను రూపొందించిందని ఆమె పేర్కొన్నారు.ఈ అభివృద్ధి ప్రణాళికలో తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి పాత్ర అత్యంత కీలకమైందని అన్నారు.
ఈ క్రమంలో,ప్రణాళిక అమలుపై ఇప్పటికే జిల్లా కలెక్టర్ మూడు సమీక్షా సమావేశాలు నిర్వహించి, అవసరమైన చర్యలను ప్రారంభించారని తెలిపారు. అలంపూర్ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ను ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి సమర్పించి తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రభుత్వానికి నిధుల కొ రత లేనందున,అభివృద్ధి వేగంగా చేయవచ్చని తెలిపారు.మాస్టర్ ప్లాన్లోని పనులకు దాతలు ముందుకు వస్తారని తెలిపారు.
ఇతిహాస పరంగా విలువైన ఆలయ నిర్మాణాల పరిరక్షణ, పునరుద్ధరణ కోసం ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా పూర్తి స్థాయి సహకా రం అందించనున్నదని తెలిపారు. ఆలయ ప్రాంగణంలోని మ్యూజియాన్నిఆధునీకరించడంలో కూడా తగిన చర్యలు చేపట్టనున్న ట్లు తెలిపారు. అన్నదాన సత్రంను వారం లోపల ప్రారంభించాలని ఈ.ఓ కు ఆదేశించారు.2028లో జరగనున్న కృష్ణా నది పుష్కరాల నాటికి పూర్తి స్థాయిలో అమలులోకి తీసుకురావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆమె పేర్కొన్నారు.
అభివృద్ధికి సంబంధించి అన్ని పనులు సకాలంలో పూర్తయ్యేలా పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని అన్నారు. అమ్మవారితో ప్రతి ఒక్కరికీ ఉన్న భక్తి సం బంధం ఈ ప్రణాళిక విజయానికి మార్గదర్శకమవుతుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశా రు. ఆలయ ప్రాముఖ్యతను ప్రతిబింబించే వి ధంగా,ఇది ఆధ్యాత్మికతతో పాటు చారిత్రకం గా కూడా విస్తృతంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు.
ఆలయం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం: రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి. చిన్నారెడ్డి
అలంపూర్ శక్తిపీఠంగా గొప్ప ఆధ్యాత్మిక, చారిత్రక ప్రాధాన్యం కలిగిన ప్రాంతమని, ఇక్కడి జోగులాంబ దేవస్థానాన్ని దేశానికే ఆదర్శంగా అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నామని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షు డు జి. చిన్నారెడ్డి తెలిపారు.ఉమ్మడి మాహబూబ్నగర్ జిల్లాలో ప్రసిద్ధి చెందిన జోగు లాంబ ఆలయానికి పూర్తిస్థాయిలో అభివృద్ధి అవసరమని తెలిపారు.
ఈ ప్రణాళికకు జిల్లా కలెక్టర్ ఇప్పటికే మూడు సమీక్ష సమావేశాలు నిర్వహించారని తెలిపారు. జోగు లాంబ ఆలయం జాతీయ రహదారి పరిధిలో ఉండటంతో, గద్వాల నుంచి ఆలం పూర్ వరకు రోడ్సైడ్లో ఆర్చులు, అవెన్యూవ్ ప్లాంటేషన్,సైన్బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. జడ్చర్ల నుంచి ఆలయానికి వ చ్చే మార్గంలో ఈ సూచికల ఏర్పాటుతో భ క్తులకు స్పష్టమైన దిశానిర్దేశం కలుగుతుందన్నారు. ఆలయం వద్ద శుభ్రమైన వాతావర ణం, బస్ స్టాండ్, సౌకర్యవంతమైన గదులు, శుద్ధమైన ఆహారం, పార్కింగ్ ఏర్పాట్లు ఉండే లా చర్యలు తీసుకోవాలని అన్నారు.
అలంపూర్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ మంచి సూ చనగా భావిస్తున్నట్టు పేర్కొంటూ, ఆ పను లు వచ్చే రెండు మూడు నెలల్లో పూర్తి అ య్యే అవకాశముందని తెలిపారు. ఆలయ ని ర్మాణ శైలిని దృష్టిలో ఉంచుకొని అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నారు.ఈ అభి వృద్ధి కార్యక్రమాలకు అవసరమైన నిధులు కేటాయించడంలో ప్రభుత్వం ఎటువంటి వెనుకడుగు వేయదని, అవసరమైనంత మే రకు పూర్తిగా మద్దతు అందించేందుకు సిద్ధం గా ఉందని స్పష్టం చేశారు.
ప్రసాద్ పథకాన్ని త్వరలో ప్రారంభించాలి: ఎమెల్యే విజయుడు
అలంపూర్ అభివృద్ధి పనులు వేగంగా పూర్తవ్వాలని, వచ్చే పుష్కరాల నాటికి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్య లు తీసుకోవాలని అలంపూర్ శాసన సభ్యు లు విజయుడు పేర్కొన్నారు.ఆలయ ప్రాంగణంలో భద్రతా ఏర్పాట్లు తప్పనిసరి అని, భ క్తుల సౌకర్యార్థం ప్రసాద్ పథకాన్ని త్వరలో ప్రారంభించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ సంతోష్, అదనపు కలెక్టర్లు లక్ష్మి నారాయణ,నర్సింగ రావు, ఆలయ క మిటీ చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి,అలంపూర్ మా ర్కెట్ యార్డ్ చైర్మన్ దొడప్ప,ఆర్డీవో అలివే లు, ఆర్కిటెక్ట్ సూర్య నారాయణ మూర్తి, టెం పుల్ డిజైనర్ గోవింద హరి, స్థాపతి వాలినాయగం, ఎండోమెంట్స్ అడిషనల్ కమిషనర్ కృష్ణవేణి,రాష్ట్ర టూరిజం శాఖ ఎస్.ఈ సరి త, ఈ.ఓ పురేందర్, ఆర్ అండ్ బి ,పబ్లిక్ హె ల్త్ ,మిషన్ భగీరథ,టూరిజం,పునరావస్థ, వివిధ శాఖల జిల్లా అధికారులు, సంబంధిత కేంద్ర అధికారులు, ప్రజా ప్రతినిధులు,తదితరులు పాల్గొన్నారు.