3 July, 2026 | 9:27 PM

Breaking News

రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •   హెచ్‌పి గ్యాస్ ఏజెన్సీని ఆకస్మిక తనిఖీ చేసిన హెచ్‌పిసిఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ కోమర శ్రీనివాసు   •   బదిలీపై వెళ్లిన ఇంచార్జ్ ఎంపీడీవోకు ఘన సన్మానం   •   ఆయిల్ పామ్ సాగుతో అద్భుత ఫలితాలు సాధిస్తున్న ప్రభాకర్ రెడ్డికి సన్మానం   •   వర్షపు ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి టార్పాలిన్ అందించిన సర్పంచ్   •   స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) 2027 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి   •   ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం   •   పిచ్చిమొక్కల తొలగింపు   •   తాగారు.. దొరికారు..   •   కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మండల ప్రత్యేక అధికారి   •  

ఇంత కూడా బాధ్యత లేదా?

04-05-2025 01:26 AM

అధికారులపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఫైర్

అంబర్‌పేట్ ఫ్లుఓవర్ పనుల్లో నిర్లక్ష్యంపై సీరియస్

హైదరాబాద్, మే 3 (విజయక్రాంతి): రూ.415 కోట్ల వ్యయంతో నిర్మించిన అంబర్‌పేట్ ఫ్లుఓవర్ ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి వస్తున్నారని తెలిసినా కనీసం అభివృద్ధి పనులు పట్టించుకోకపోవడం ఏంటని అధికారులపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

శనివారం సాయం త్రం అంబర్‌పేట ఫ్లు ఓవర్ పనులను పరిశీలించిన తర్వాత ఆయన అధికారుల తీరుపై విస్మయం వ్యక్తం చేశారు. ఫ్లుఓవర్ కింద జరగాల్సిన రోడ్ల విస్తరణ, ప్లాంటేషన్, గ్రీనరీ డెవలప్‌మెంట్ వంటి పనులపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, సంబంధిత అధికారులపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా నేషనల్ హైవేస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ కృష్ణప్రసాద్, ఆర్‌అండ్‌బి ఎస్‌ఈ ధర్మారెడ్డి, జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ రవికిరణ్, అడిషనల్ డీసీపీ నర్సయ్యల తీరుపై కిషన్‌రెడ్డి మండిపడ్డారు.

భూ సేకరణ బాధ్యతను మోస్తున్న జీహెచ్‌ఎంసీ నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. అధికారులు మతపరమైన నిర్మాణాల కారణంగా అడ్డంకులు ఉన్నట్లు చెపుతున్నప్పటికీ వాస్తవంగా అక్కడ అలాంటి సమస్యలే లేవని స్థానికులు అంటున్నట్లుగా వెల్లడించారు. అధికారుల నిర్లక్ష్యం, పోలీసు యంత్రాంగం రక్షణ కల్పించడంలో వైఫల్యం చెందడాన్ని తప్పుబట్టారు. నిధులు ఇచ్చిన తర్వాత పనిచేయకపోతే ప్రజలకు సమాధానం చెప్పేది ఎవరని ఆయన అధికారులను నిలదీశారు. తక్షణమే పెండింగ్ పనులను పూర్తిచేయాలని ఆదేశించారు.