16 April, 2026 | 10:03 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

నిస్వార్థ సేవకుడు దామోదరం సంజీవయ్య

04-05-2025 01:24 AM

సీఎం అయినా సొంత ఇల్లు లేదు

కాంగ్రెస్ నేత వీ హనుమంతరావు 

హైదరాబాద్, మే 3 (విజయక్రాంతి): మాజీ సీం, బడుగు, బలహీన వర్గాలకు చెందిన నాయకుడు దామోదరం సంజీవ య్య పేద వర్గాల ప్రజల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని దామోదరం సంజీవయ్య ట్రస్ట్ చైర్మన్ వీ హనుమంతరావు అన్నారు. సీఎం, పీసీసీ అధ్యక్షుడిగా ఉండికూడా సొంత ఇంటిని కూడా సంపాదించుకోలేని నిస్వార్థ సేవకుడని కొనియాడారు.

శనివారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయం లో కేంద్రమంత్రిగా కూడా బలహీనవర్గాల కోసం కృషి చేశారన్నారు. నేడు వార్డు  మెంబర్ల్లు కూడా కోట్లు సంపాదించుకుంటున్నారని, సంజీవయ్య మాత్రం ఉమ్మడి ఏపీకు సీఎం అయినా ఆస్తులు కూడబెట్టలేదన్నారు. ఈ నెల 7న నెక్లెస్‌రోడ్డులో జరిగే సంజీవయ్య వర్ధంతికి  పార్టీ శ్రేణులు భారీగా హాజరుకావాలన్నారు.