3 July, 2026 | 8:40 PM

Breaking News

శ్రీ లక్ష్మి భూలక్ష్మి సమేత శీతలాదేవి విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి   •   అబద్ధపు హామీలకు కేరాఫ్ కాంగ్రెస్ పార్టీ   •   కస్తూర్బా గాంధీ విద్యార్థినీలకు ఏకరూప దుస్తులు, నోట్ బుక్స్ పంపిణీ   •   దేవ్ విజన్ సెంటర్ , ఆప్టికల్స్ ప్రారంభించిన సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా   •   సాధిక్ అలీ జయంతి సందర్భంగా శాంతినగర్ పాఠశాలకు డ్యూయల్ డెస్క్‌ల విరాళం   •   అధిక ఫీజుల దోపిడీని అరికట్టాలి: డీవైఎఫ్‌ఐ   •   డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు ఏర్పాట్లు పూర్తి   •   వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలి   •   గీతంలో పికిల్ బాల్ కోర్టులు ప్రారంభం   •  

నిస్వార్థ సేవకుడు దామోదరం సంజీవయ్య

04-05-2025 01:24 AM

సీఎం అయినా సొంత ఇల్లు లేదు

కాంగ్రెస్ నేత వీ హనుమంతరావు 

హైదరాబాద్, మే 3 (విజయక్రాంతి): మాజీ సీం, బడుగు, బలహీన వర్గాలకు చెందిన నాయకుడు దామోదరం సంజీవ య్య పేద వర్గాల ప్రజల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని దామోదరం సంజీవయ్య ట్రస్ట్ చైర్మన్ వీ హనుమంతరావు అన్నారు. సీఎం, పీసీసీ అధ్యక్షుడిగా ఉండికూడా సొంత ఇంటిని కూడా సంపాదించుకోలేని నిస్వార్థ సేవకుడని కొనియాడారు.

శనివారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయం లో కేంద్రమంత్రిగా కూడా బలహీనవర్గాల కోసం కృషి చేశారన్నారు. నేడు వార్డు  మెంబర్ల్లు కూడా కోట్లు సంపాదించుకుంటున్నారని, సంజీవయ్య మాత్రం ఉమ్మడి ఏపీకు సీఎం అయినా ఆస్తులు కూడబెట్టలేదన్నారు. ఈ నెల 7న నెక్లెస్‌రోడ్డులో జరిగే సంజీవయ్య వర్ధంతికి  పార్టీ శ్రేణులు భారీగా హాజరుకావాలన్నారు.