calender_icon.png 16 June, 2025 | 12:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇజ్రాయెల్ యుద్ధాన్ని తక్షణమే ఆపాలి

15-06-2025 12:27:48 AM

వామపక్షాల డిమాండ్

హైదరాబాద్, జూన్ 14 (విజయక్రాంతి): ఇజ్రాయెల్ మారణహోమ యుద్ధాన్ని తక్షణమే ఆపాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. శనివారం సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర వామపక్ష పార్టీలు సమావేశమయ్యాయి. స మావేశానికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అధ్యక్షత వహించగా సీపీఐ నుంచి పశ్య పద్మ, సీపీఎం నుంచి జూలకంటి రంగారెడ్డి, సీపీఐ(ఎంఎల్) న్యూడెమొక్రసీ నుంచి వేము లపల్లి వెంకట్రామయ్య, గోవర్ధన్, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ రమేష్ రాజా, ఎస్‌యూసీఐ(సీ) మురహరి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత 20 నెలలుగా గాజాలో పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ నిరంతర బాంబు, వైమానిక దాడులకు పాల్పడుతూ మారణహోమాన్ని సృష్టిస్తున్నదని తెలిపారు. ఇప్పటికే 50 వేల మంది మరణించారని ఆస్పత్రులు, పాఠశాలలే  లక్ష్యంగా  వేలాది మందిని పొట్టన పెట్టుకున్నదని ఆవేదన వ్య క్తం చేశారు. ఐక్యరాజ్య సమితితోపాటు ప్రపంచవ్యాప్తంగా ఈ దుశ్చర్య ను వ్యతిరేకిస్తున్నా, అమెరికా, కొన్ని మిత్రదేశాల మద్దతుతో బీభత్సం సృష్టిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 19న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు.