calender_icon.png 15 June, 2025 | 10:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గాంధీనగర్‌లో ‘అమ్మ ఒడి.. అంగన్వాడీ’

15-06-2025 12:25:59 AM

పిల్లలకు అక్షభ్యాసం చేయించిన కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

ముషీరాబాద్, జూన్ 14 (విజయక్రాంతి): వేసవి సెలవుల అనంతరం మొదలైన అంగన్వాడీ కేంద్రాల్లో కొత్తగా చేరిన పిల్లలకు జవహర్ నగర్ కమ్యూనిటీ హాల్ లో వున్న అంగన్వాడీ కేంద్రంలో శనివారం ‘అమ్మఒడి..అంగన్వాడీ‘ కార్యక్రమం లో బాగంగా గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్  ఎ. పావని వినయ్ కుమార్ పిల్లలకు  అక్షరాభ్యాసం చేశారు. బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ తో కలిసి పిల్లలకు అక్షరాలు రాయించారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్  మాట్లాడుతూ అంగన్వాడీల్లో చిన్న పిల్లలకు మొదటి విద్యాభ్యాసం మొదలవుతుందని, పిల్లలకు విద్యతో పాటు ఆటలు, పాటలు, రైమ్స్  నేర్పడమే కాకుండా ప్రతి రోజూ పౌష్టికాహారం అందిస్తారని. ప్రైవేటు ప్లే స్కూల్ లకు మించి ఉచితంగా పిల్లలకు మంచి విద్యాభ్యాసాన్ని అంగవాడిలో అందచేస్తున్నారని అన్నారు.

పిల్లలతో పాటు గర్భిణులకు, బాలింతలకు అంగన్వాడీ ద్వారా పౌష్టికాహారం అందుతుందని, ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ జ్యోతి, అంగన్వాడీ టీచర్లు వై. నర్సమ్మ, డి. ప్రమీల, కౌసర్ బేగం, సభిత, ఆయా మాణిక్యమ్మ  పిల్లల తల్లులు తదితరులు పాల్గొన్నారు.