ఒక్కరోజులోనే కూలిపోవచ్చు..
త్వరలోనే కేంద్రంలో ‘ఇండియా’ ప్రభుత్వం
మమతా బెనర్జీ వ్యాఖ్యలు
కోల్కతా, జూన్ 8: కేంద్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని సార్లు ప్రభుత్వాలు ఒక్క రోజులో కూడా కూలిపోయిన సందర్భాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. శనివారం కోల్కత్తాలో టీఎంసీ పార్టీ సమావేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో త్వరలోనే ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని ప్రమాణస్వీకారానికి తాము హాజరుకాబో మని తెలిపారు.
ఎందుకంటే అన్యాయంగా, అప్రజాస్వామికంగా ప్రభు త్వాన్ని ఏర్పాటు చేస్తున్నారని దుయ్యబట్టారు. ‘400 సీట్లు వస్తాయంటూ బీజేపీ ఊదరగొట్టింది. ఇప్పుడు మెజారిటీ కూడా బీజేపీకి రాలేదు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఇండియా కూటమి చెప్పకపోయినంత మాత్రాన ఏమీ జరగదని అనుకోవద్దు. ఏం జరుగుతుందో చూస్తున్నామంతే.. ఇండియా కూట మి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. కొద్ది రోజులు ప్రభుత్వాన్ని నడపనివ్వండి. 15 రోజుల్లో ప్రభుత్వం పడిపోవచ్చు. ఎవరికి తెలుసు?’ అని మమతా అన్నారు.






