20-06-2025 10:57:35 PM
సూర్యాపేట (విజయక్రాంతి): విద్యార్థులకు బ్యాగులు అందజేయడం అభినందనీయమని మండల విద్యాధికారి శేషగాని శ్రీనివాస్ గౌడ్(Mandal Education Officer Seshagani Srinivas Goud) అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని తాళ్ల ఖమ్మం పహాడ్ గ్రామంలో మూడు ప్రాథమిక పాఠశాలలో గ్రామానికి చెందిన మండవ వీరాంజనేయులు కుమారుడు మండవ రియాన్స్ గౌడ్ జన్మదినం సందర్భంగా విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ పంపిణీ చేసి మాట్లాడారు.
విద్యార్థులు దాతల సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలలో నాణ్యమైన విద్య అందుతుందన్నారు. ప్రభుత్వం పాఠశాలల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తుందన్నారు. అనంతరం వీరాంజనేయులు దంపతులను సన్మానించారు. కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్ఎం యాకయ్య, మండవ సైదులు, కొండ మల్సూర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.