21-06-2025 12:00:00 AM
నిర్మల్ జూన్ ౨0 (విజయక్రాంతి) : పదేళ్ల తర్వాత అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ముధోల్ నియోజకవర్గం నేత ల మధ్య గ్రూపు విభేదాలు పార్టీ క్యాడర్ను ఆందోళన కలిగిస్తున్నాయి. 16 నెల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముధోల్ నియోజకవర్గం నుండి బిజెపి ఎమ్మెల్యేగా పవర్ రామారావు పటేల్ విజయం సాధించారు.
కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన నియోజకవర్గ ఇన్చార్జి నారాయణరావు పటేల్ ఆ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ నియోజకవర్గ ఇన్చార్జిగా పార్టీ ప్రకటించింది. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో టిఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన గడ్డం గారి విట్టల్ రెడ్డి కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాల చారి కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడంతో ముధోల్ నియోజకవర్గం ముగ్గురు నేతల మధ్య వర్గ పోరు నెలకొందని పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు బహిరంగంగానే చెపుతు న్నారు.
నారాయణరావు పటేల్ ఒక పర్యా యం ఎమ్మెల్యేగా గెలుపొందగా విట్టల్ రెడ్డి టిఆర్ఎస్ ప్రభుత్వంలో పదేళ్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 2009 ఎన్నికల్లో ముధోల్ నియోజకవర్గ నుంచి పోటీ చేసిన వేణుగోపాల చారి ఎమ్మెల్యేగా గెలవ డంతో ఈ ముగ్గురు నేతలకు నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో వారి వారి వర్గాలకు చెందిన క్యాడర్ ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది.
బైంసా మున్సిపాలిటీ తో పాటు కుంటాల కుబీర్ తానూర్లోకేశ్వరం ముథోల్ బాసర్ మండలాలు ఉండగా ఈ ఆరు మండలాల్లో ఈ ముగ్గురు నేతలు పార్టీ కార్యక్రమాలను ఎవరికి వారే అనుసరిస్తూ అమలు చేస్తున్నంతో ఇతర వర్గీయులు తాము కాంగ్రెస్లో ఉన్నప్పటికీ తమను పట్టించుకోవడంలేదని అధిష్టానానికి ఎన్నోసార్లు ఫిర్యా దు చేశారు.
మొన్నటి ఎన్నికల వరకు సైలెం ట్గా ఉన్న వేణుగోపాల చారి ముధోల్ రాజకీయాలపై ప్రత్యేక దృష్టి పెట్టి వివిధ మండలాల్లో పర్యటిస్తూ తన క్యాడర్ను పెంచుకునేందుకు చాప కింద నీరులా విశ్వ ప్రయత్నా లు సాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.
సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సీనియర్ నేతగా కాం గ్రెస్ సలహాదారులుగా వేణుగోపాలచారికి కాంగ్రెస్లో మంచి ఇమేజ్ ఉండడంతో రాబోయే ఎన్నికల్లో ముధోల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకునేందుకు ముధోల్ నియోజకవర్గం విస్తృతంగా పర్యటిస్తూ తన అనుచరులకు రాజకీయ నామినేటెడ్ పదవులను ఇప్పించుకునేందుకు కృషి చేస్తున్నారు.
ఇందులో బాగానే చారికి అత్యంత సన్నితుడైన గన్ను నరసారెడ్డికి ఆత్మ కమిటీ చైర్మన్ పదవి ఇప్పిచ్చినట్టు ప్రచారం జరుగుతుంది. దీన్ని ముధోల్ నియోజకవర్గ ఇంచార్జ్ నారాయణరావు పటేల్ మాజీ ఎమ్మెల్యే జి విట్టల్ రెడ్డి సవాల్గా తీసుకొని కుబీర్ బైంసా మార్కెట్ ఆత్మ పాలకవర్గాల్లో తమ వర్గీయులకు ఇప్పించుకునేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేసి సఫలీకృతం అయ్యారు.
ఈ ముగ్గురు నేతలు కూడా నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో తమకంటూ ఒక ప్రత్యేక వర్గం ఉండడంతో ముధోనియోగంలో తమ ఉనికిని కోల్పోకుండా ఇప్పటి నుండి పార్టీ నేతలు కష్టపడి పార్టీ అభివృద్ధికి వ్యక్తిగత అభివృద్ధికి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు
కాంగ్రెస్ కేడర్లో నిరుత్సాహం
ముదురు నియోజకవర్గంలోని అన్ని మండలాలతో పాటు భైంసా మున్సిపాలిటీలో పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ద్వితీ య శ్రేణి నాయకత్వం ఈ ముగ్గురు నేతల వ్యవహార కారణంగా నిరుత్యానికి గురైతునట్టు పార్టీ కార్యకర్తలే చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని గత ఎన్నికల్లో గెలుపు కోసం కృషి చేసిన పార్టీ నేతలు మండల స్థా యి కార్యకర్తలు ఇప్పుడు ఏ నేతకు మద్దతు పలకాలో అర్థం కాక అయోమయానికి గురై పార్టీ కార్యక్రమాలకు కొందరు దూరం గా ఉంటున్నట్లు ప్రచారం జరుగుతుంది.
ప్రభుత్వం త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు సర్పంచ్ ఎన్నికలను నిర్వహిం చేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ముధోల్ యువ కుల్లో ముఖ్యమైన ముగ్గురు నేతలు తమ అనుచరులకి మద్దతు ఇచ్చే అవకాశం ఉండడంతో మిగతా రెండు వర్గాల వారు పార్టీకి నష్టం కలిగించే విధంగా వివరించే అవకాశం ఉందని పార్టీ నేతలే బహిరంగంగా చెబుతున్నారు.
ఇప్పటికీ ముదురు నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలతో పాటు సమావేశాలు నిర్వహించిన ఈ ముగ్గురు ఎవరికి వారి అనే తీరులో తమ కార్యక్రమాలను అమలు చేసుకుంటున్నారు. ఇటీవలే బైంసా బాసరలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముధోల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ స్థితిగతులు పరిస్థితులపై మండల స్థాయి నేతలు తీవ్రంగా చర్చించినట్టు దీన్ని పరిష్కరించేందుకు కృషి చేయా లని వారంతా డిమాండ్ చేయడం తీవ్ర చర్చకు దారితీసింది. పార్టీ ఈ ముగ్గురు నేతలను సమన్వయం చేసుకొని మొదలు నియోగంలో ఏ మేరకు సఫలీకృతం అవుతుందో కాలమే నిర్ణయిస్తుంది