calender_icon.png 18 June, 2025 | 12:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వందేళ్ల ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించాలి

17-06-2025 08:31:54 PM

గ్రామీణ ప్రజల సమస్యలపై స్పందించేది సిపిఐనే...

సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా...

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): వందేళ్ల సుదీర్ఘ పోరాటాల స్పూర్తితో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిస్కారం పార్టీ శ్రేణులు నిరంతరం కృషి చేయాలని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా(CPI District Secretary SK Sabir Pasha) కోరారు. లక్ష్మీదేవి పల్లి మండలంలోని ఉమ్మడి సీతారాంపురం, వేపలగడ్డ, లాలుతాడా పంచాయతీల పరిధిలోని 14 గ్రామాల మహాసభ సోమవారం రాత్రి జరిగింది. మహాసభకు ముఖ్య అతిధిగా హాజరైన సాబీర్ పాషా మాట్లాడుతూ... లక్ష్మీదేవిపల్లి ఏజెన్సీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందిస్తూ వాటి పరిష్కరం కోసం కమ్యూనిస్టు పార్టీ కృషి చేస్తోందని, ప్రజలకు సేవలందిస్తున్న ఫలితంగానే గ్రామాల్లో సిపిఐని ప్రజలు ఆదరిస్తున్నారన్నారు.

పోడు భూములకు పట్టాలు, సంక్షేమ పథకాల అమలుకోసం సిపిఐ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. పూర్తిస్థాయిలో రైతులకు రైతు భరోసా అందించాలని, వరికి రావాల్సిన బోనస్ క్వింటాకు రూ.5 వేలు విడుదల చేయాలనీ డిమాండ్ చేశారు. మండల కార్యదర్శి చంద్రగిరి శ్రీనివాసరావు, నాయకులు ఎస్ కె ఫహీమ్, నేరెళ్ల  రమేష్, నూనావత్ గోవిందు, దారావత్ శ్రీను, బానోత్ నెహ్రు, సాపావట్ రవి,  జర్పుల ఉపేందర్, నూనావత్ చింటూ, బోడ రాములు, గుగులోత్ శ్రీను, తదితరులు పాల్గొన్నారు.