calender_icon.png 18 June, 2025 | 12:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూ సమస్యలు పరిష్కారం చేయాలి

17-06-2025 08:29:41 PM

జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగువాన్..

కామారెడ్డి (విజయక్రాంతి): క్షేత్రస్థాయిలో పరిశీలించి భూ సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్(District Collector Ashish Sangwan) రెవిన్యూ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కామారెడ్డి పట్టణంలోని 1వ వార్డు ఇల్చిపూర్ లో నిర్వహించిన  భూభారతి రెవిన్యూ సదస్సును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్బంగా రెవిన్యూ సదస్సులో దరఖాస్తు చేసుకున్న రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని భూ సమస్యలను పరిష్కరించేందుకే ప్రభుత్వం ధరణి స్థానంలో భూభారతి చట్టంను తీసుకువచ్చిందని ఈ భూభారతి రెవిన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోని భూ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు. 

అలాగే భూభారతి రెవిన్యూ సదస్సులలో స్వీకరించిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి రెవిన్యూ రికార్డ్ లను సరిచూసుకుని రెవిన్యూ భూభారతి చట్టం మార్గదర్శకాల ప్రకారం పరిష్కరించాలని, అన్ని దరఖాస్తులను ఆన్లైన్ లో పొందుపరిచలని తహసీల్దార్ జనార్దన్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి మండల డిప్యూటీ తహసీల్దార్, ఆర్ఐ, రెవిన్యూ టీం సభ్యులు పాల్గొన్నారు.