14 July, 2026 | 6:53 PM

Breaking News

కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యం   •   కరాటేతోనే విద్యార్థినులకు ఆత్మరక్షణ   •   తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చే కుట్ర జరుగుతోంది   •   భద్రతా చర్యలపై బ్యాంక్ మేనేజర్లకు అవగాహన కల్పించిన సీఐ రంజిత్ రావు   •   మండలాధ్యక్షునిపై అసంతృప్తి రాగాలు   •   చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ వినతి   •   విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్గి ఉండాలి   •   సింగరేణి హెడ్ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి: ఐఎఫ్టియు   •   జగన్నాథ రథయాత్ర జిల్లా కలెక్టర్ కు ఆహ్వానం   •  

2017లోనే ఐటీఐఆర్ నిలిపివేత

25-03-2025 12:50 AM

ఎంపీ చామల ప్రశ్నకు కేంద్రమంత్రి జితిన్ ప్రసాద్ సమాధానం

హైదరాబాద్, మార్చి 24 (విజయక్రాం తి): ఐటీఐఆర్(ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్) ప్రాజెక్టు పునరుద్ధరణ కోసం తెలంగాణ ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు వచ్చాయా..? అని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి మూడు రోజుల కింద లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు సంబంధిత శాఖ మంత్రి జితిన్ ప్రసాద్ సోమవారం సమాధానమిచ్చారు.

ఈ ప్రాజెక్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే కేంద్రం పరిశీలనలో ఉంద ని, 2013లో ఆమోదం లభించిందని పేర్కొన్నారు. 2008 ఐటీఐఆర్ పాలసీలో భాగం గా ఐటీ, మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లో  హైదరాబాద్‌ను అభివృద్ధి చేసే ఉద్దేశంతో 2013 లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ఆమోదించిందని వివరించారు.

2017లో దాన్ని కేంద్రం నిలిపివేసిందని ఆయన వెల్లడించారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్, మాన్యుఫ్యా క్చరింగ్ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రపంచస్థాయి మౌలిక వసతులు కల్పించేందుకు కేంద్రం ఈఎంసీ2.0 పథకాన్ని నోటిఫై చేసిందని, ఈ పథకం కింద తెలంగాణలోని నాలుగు ప్రాంతాలను ఎంపికచేసినట్లు చెప్పారు. వాటిలో కొంగరకలా న్‌లో ఈసిటీ, మహేశ్వరం, రాయదుర్గంలోని నాలెడ్జ్ సిటీ, మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లి ఉన్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు.