28-06-2025 12:42:37 AM
బీసీ విద్యార్థి సంఘం కేంద్ర కమిటీ అధ్యక్షుడు తాటికొండ విక్రం గౌడ్
ముషీరాబాద్, జూన్ 27 (విజయక్రాంతి): విద్యార్థులకు ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వని కళాశాల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని బీసీ విద్యార్థి సంఘం కేంద్ర కమిటీ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్ గౌడ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్ ను కలిసి వినతిపత్రం అందజేసినట్లు ఆయన వెల్లడిం చారు.
ఈ సందర్భంగా విక్రమ్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గత మూడు సంవత్సరాలుగా ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్లు, స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయకపోవడంతో కళాశాల యాజమాన్యాలు కోర్సులు పూర్తి చేసిన తర్వాత కూడా అసలు సర్టిఫికెట్లను ఇవ్వకపోవడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటు న్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యార్థులు ఉన్నత చదువులకు వెళ్లాలనుకున్నా, లేదా ఉద్యోగాలకు వెళ్లాలనుకున్నా, వారికి అసలు సర్టిఫికెట్లు అవసరమన్నారు. ప్రైవేట్ కళాశాల యాజమాన్యా లు విద్యార్థులపై కనికరం లేకుండా వారి సర్టిఫికెట్లను వెనక్కి తీసుకుంటున్నాయన్నారు. పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివేలా చూడడమే ఫీజు రీయింబర్స్మెంట్ల లక్ష్యమని, ఇక్కడ విద్యార్థికి కళాశాల ఫీజుతో ఎటువంటి సంబంధం లేదన్నారు.