15 April, 2026 | 12:10 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

అణగారిన కులాల గొంతుక జగ్జీవన్‌రామ్

06-04-2025 12:13 AM

ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్

ముషీరాబాద్, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): దేశంలోని అణగారిన కులాల గొంతుక బాబు జగ్జీవన్ రామ్ అని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ కొనియాడారు. దళితోద్యమ నేత, సామాజిక సంస్కర్త బాబు జగ్జీవన్ రామ్ 116 వ జయంతి సందర్బంగా బషీర్ బాగ్ లోని అయన విగ్రహానికి డాక్టర్ దిడ్డి సుధాకర్, ఆప్ రాష్ట్ర నేతలు డా. లక్ష్య నాయుడు, రాకేష్ రెడ్డి, అజీమ్ బేగ్, శహబాజ్, ఎస్.ఎన్. రెడ్డి, మోనికా తదితరులు ఫూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్బంగా డాక్టర్ దిడ్డి సుధాకర్ మాట్లాడుతూ 1935లో బాబు జగ్జీవన్ రామ్  ఇండియన్ డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ ఏర్పాటులో చాలా ముఖ్యమైన పాత్ర పోషించి, అణగారిన ప్రజలకు, సామాజిక న్యాయం, సమానత్వం మరియు సంక్షేమం కోసం అనేక ఉద్యమాలను నిర్వహించడాన్ని గుర్తు చేసారు.

భారత పార్లమెంట్ లో సామాజిక న్యాయ సూత్రాలను బలంగా నొక్కి చెప్పారని తెలిపారు. సామాజిక అణచివేత మరియు కుల వివక్షకు వ్యతిరేకంగా ఆయన చేసిన యుద్ధాన్ని స్ఫూర్తిగా తీసుకొని సామాజిక న్యాయం కోసం ఉద్యమించాలని డాక్టర్ దిడ్డి సుధాకర్ పిలుపునిచ్చారు.