11-06-2025 12:00:00 AM
న్యూఢిల్లీ, జూన్ 10: కేంద్రంలోని మోదీ ప్రభుత్వ ం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ‘ఒకే దేశం, ఒకే ఎన్ని క’ 2034 వరకు సాధ్యమయ్యే అవకాశం లేదని బీజే పీ ఎంపీ పీపీ చౌదరీ స్పష్టం చేశారు. జమిలి ఎన్నికలకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లుపై అ ధ్యయనం కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పీ పీ చౌదరీ చైర్మన్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసి ందే. ఇండియన్ ఎక్స్ప్రెస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జమిలి ఎన్నికపై పీపీ చౌదరీ కీలక వ్యాఖ్యలు చేశారు.
జమిలి ఎన్నికలపై రూపొందించిన బిల్లు నిర్మాణమే ప్రధాన సమస్య అని పేర్కొన్నారు. ఒకే దేశం, ఒకే ఎ న్నిక కోసం ప్రతిపాదించిన బిల్లు రాజ్యాంగంలోని కొత్త ఆర్టికల్ 82ఏకు జోడించాల్సి వస్తుందన్నారు. ఈ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి ‘అపాయింట్ డే’ను ప్ర కటించాల్సి వస్తుందని తెలిపారు. ప్రస్తుత 18వ లోక్సభ 2029తో ముగియనుందని, 2029లో మొ దలయ్యే 19వ లోక్సభకు అనుగుణంగా ఆయా రా ష్ట్ర శాసనసభల పదవీకాలం కుదించబడుతుంద న్నారు.
దీంతో 2034లో జరిగే లోక్సభ ఎన్నికలతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అవకాశముంటుందన్నారు. 2029 వర కు జమిలి ఎన్నికల బిల్లు ఆమోదం పొందకపోతే మాత్రం 2034లోనే ఒకే దేశం.. ఒకే ఎన్నిక సాధ్యమవుతుందన్నారు. ఇక జమిలి ఎన్నికలు నిర్వహిం చేందుకు ప్రస్తుతమున్న ఈవీఎంలు ఏ మా త్రం సరిపోవని, కనీసం మూడింతలు అవసరమవుతాయ న్నారు.
నియోజకవర్గాల పునర్విభజన మరో ప్రధాన సమస్య అని, 2021లో జరగాల్సిన జనగణ న ఇంతవరకు పూర్తి కాలేదని, జనగణన పూర్తయితేనే పునర్విభజన చేపట్టే అవకాశముందన్నారు. ఇది పూర్తవ్వడానికి 2027 లేదా 2028 వరకు సమయం పట్టొచ్చన్నారు. 2029లో నిర్వహించాలనుకున్నా రాజ్యాంగ సవరణ అవసరమని, కాబట్టి జమిలి ఎన్నికలకు 2034 సరైనదని అభిప్రాయపడ్డారు.