11-06-2025 12:00:00 AM
న్యూఢిల్లీ, జూన్ 10: రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) చైర్మన్ జి. సతీశ్ రెడ్డికి మరో అరుదైన గౌరవం దక్కింది. జాతీ య భద్రతా సలహా బోర్డు (ఎన్ఎస్బీ)లో సభ్యుడిగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర రక్ష ణ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా రెండేళ్ల పాటు ఎన్ఎస్బీలో సభ్యుడిగా కొనసాగనున్నారు. ఇటీవలే కేం ద్రం జాతీయ భద్రతా సలహా బోర్డును పనర్వ్యవస్థీకరించింది.
‘రా’ మాజీ చీఫ్ అలోక్ జోషి నేతృత్వంలో బోర్డును ఏర్పాటు చేసిం ది. జాతీయ భద్రతా కౌన్సిల్కు బోర్డు తమ సలహాలు, సూచనలు అందించనుంది. ఏపీలోని నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం మహిమలూరుకు చెందిన సతీశ్ రెడ్డి 1986 లో హైదరాబాద్లోని ఢిఫెన్స్ రీసెర్చి అండ్ డెవలప్మెంట్ లాబొరేటరి (డీఆర్డీఎల్)లో చేరారు. అనంతరం ఆర్సీఐ, డీఆర్డీవోలో విశిష్ట సేవలందించారు. 2015లో రక్షణ మంత్రికి శాస్త్రీయ సలహాదారుగా నియమితులయ్యారు. ఇక 2018లో డీఆర్డీవో చైర్మ న్గా నియమితులయ్యారు.