6 July, 2026 | 2:08 AM

కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా జనుముపల్లి విష్ణు వర్ధన్ రెడ్డి

06-07-2026 12:49 AM

ఎల్బీనగర్, జూలై 5 : కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ప్రసిద్ధ కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ మాజీ డైరెక్టర్ జనుముపల్లి విషువర్షన్డ్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. 

లింగోజిగూడ డివిజన్ కు  చెందిన జనుముపల్లి విషువర్షన్డ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశారు. ఈ సందర్భంగా  విషువర్ధన్  రెడ్డి మాట్లాడుతూ... ఎల్బీనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. తనకు అవకాశం కల్పించిన సీఎం రేవంత్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు.