17-06-2025 04:27:07 PM
మంచిర్యాల (విజయక్రాంతి): ఆరోగ్యవంతమైన జీవితానికి యోగా అవసరమని ప్రిన్సిపాల్ డాక్టర్ జి అనూష అన్నారు. అంతర్జాతీయ యోగ దినోత్సవం(International Yoga Day) దశాబ్ది వేడుకలలో భాగంగా మంగళవారం సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలలో "ఒక భూమి-ఒక ఆరోగ్యం కోసం యోగ" అనే అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రిన్సిపల్ మాట్లాడారు. ప్రతిరోజు యోగాకు కొంత సమయం కేటాయించాలని సూచించారు. యోగతో కలిగే లాభాలను వివరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి సునీత, అకడమిక్ కోఆర్డినేటర్ రిజ్వాన, ఫిజికల్ డైరెక్టర్ బి అరుంధ, హెల్త్ సూపర్ వైజర్ లక్ష్మీ, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పద్మజ, ఫార్మసిస్ట్ పుష్పాంజలి, యోగ ఇన్ స్ట్రక్టర్లు సుధాకర్, వంశీకృష్ణ, అటెండర్ కిషన్, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.