calender_icon.png 6 June, 2025 | 9:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫిజికల్ డైరెక్టర్ రాజేందర్ కు జేఎన్టీయూ డాక్టరేట్

04-06-2025 04:58:09 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం స్టేషన్ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలకు చెందిన ఫిజికల్ డైరెక్టర్ కొమ్ము రాజేందర్(Physical Director Kommu Rajendar)కు జేఎన్టీయూ డాక్టరేట్ ప్రధానం చేసింది.

జేఎన్టీయూ హైదరాబాదు ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగంలో రాజేందర్ ‘ఎఫెక్ట్ ఆఫ్ అక్యూట్ మారధాన్ రన్నింగ్ ఆన్ ద అప్పర్ రెస్పిరేటర్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ స్టేటస్ అండ్ లంగ్ ఫంక్షన్ స్టేటస్ అమాంగ్ ది రిక్రియేషనల్ రన్నర్స్' అనే అంశంపై పరిశోధన గ్రంథాన్ని డాక్టర్ కె.వి రాజశేఖర్, సెంట్రల్ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ యార్లగడ్డ గోపికృష్ణ పర్యవేక్షణలో ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ డాక్టర్ జి.వాసంతి (సెంట్రల్ యూనివర్సిటీ పుదుచ్చేరి) సమక్షంలో సమర్పించినందుకు డాక్టరేట్ అవార్డు ప్రకటించారు.

మంగళవారం జేఎన్టీయూలో జరిగిన 13వ స్నాతకోత్సవంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, వైస్ ఛాన్స్లర్ కిషన్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా డిగ్రీ పట్టాను అందుకున్నారు. ఫిజికల్ డైరెక్టర్ రాజేందర్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ పోటీల్లో టెక్నికల్ ఎంపైర్ గా వ్యవహరిస్తూ దేశ విదేశాల్లో జరిగిన అనేక పోటీలకు ప్రాతినిధ్యం వహించారు.