12-06-2025 01:00:46 AM
- డ్రైనేజీ, సీసీ రోడ్లు, వీధిలైట్లకు నోచుకోలే
- వర్షం వస్తే జలదిగ్బంధం
- ఇళ్ళ ముందే మురుగునీరు నీళ్ళు
- పట్టించుకోని అధికారులు
గోపాల పేట జూన్ 11: అయోధ్య నగర్ కాలనీ ఏళ్లు గడుస్తున్న ఈ కాలనీలో ఏ మార్పు రాలేదు. ప్రభుత్వాలు పాలకులు మారుతున్న ఈ అయోధ్య నగర్ కాలనీవాసుల సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగడి మాదిరిగా దర్శనమిస్తుంది. వర్షాకాలంలో కాలనీ పైనుండి వరద వచ్చినా కాలనీలో ఉన్న ఇండ్లు మొత్తం జలదిగ్బంధంలో కొట్టుమిట్టాడిల్సిన పరిస్థితి నెలకొంది.
ఇది వనపర్తి జిల్లా గోపాలపేట మండల కేంద్రంలో ఓ అయోధ్య నగర్ కాలనీ ఈ కాలనీ ఏర్పడి సుమారుగా 15 సంవత్సరాలు గడుస్తున్న ప్రభుత్వాలు మారిన సమస్యకు పరిష్కారం మాత్రం దొరకడం లేదని ఆ కాలనీవాసులు వాపోతున్నారు. ఈ కాలనీలో సుమారుగా 50 నుంచి 70 కుటుంబాలు సుమారుగా 200కు పైగా జనాభా ఉన్నారు. కాలనీవాసులు ప్రభుత్వంలోని గ్రామపంచాయతీకి కట్టాల్సిన రుసు ములు గాని పర్మిషన్ గాని చెల్లింస్తున్నప్పటికీ గ్రామపంచాయతీ అధికారులకు మాత్రం అయోధ్య నగర్ కాలనీవాసులపై దయలేకుండా పోయిందని వాపోతున్నారు.
ఈ కాలనీ మురుగు కాలువలు, వీధిలైట్లకు నోచుకోలేదు. ప్రతి ఏటా వర్షాలు కురిసినప్పుడల్లా ఈ కాలనీ చుట్టూ నీరు కమ్ము కోవడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటికి రాలేకపోతారు. ఇండ్ల చుట్టూ నీరు మొత్తం పోయేసరికి సుమారుగా 10 రోజులు పడుతుందని కాలనీవాసులు చెబుతున్నారు. ఇక ఈ కాలనీలో నేటికీ వీధిలైట్లు ఏర్పాటు చేయలేకపోవడం వల్ల విష సర్పాల బారిన పడుతున్నామని కాలనీవాసులు పలు మార్లు ధర్నాలు రాస్తారోకోలు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చిన ఎవరు కూడా పట్టించుకోలేదు.
ఈ కాంగ్రెస్ ప్రభుత్వమైన స్పందించి ప్రధాన రోడ్డుపై ఉన్న అయోధ్య నగర్ కాలనీకి డ్రైనేజీ నిర్మాణం. సీసీ రోడ్ల కోసం నిధులు మంజూరు చేయించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ప్రభుత్వం కాలనీవాసుల సమస్యలను గుర్తించి డ్రైనేజీ నిర్మాణం వీధిలైట్లు సీసీ రోడ్లు వేయిస్తే ప్రభుత్వానికి మా కాలనీ రుణపడి ఉంటుందని కాలనీ ప్రజలు కోరుతున్నారు.
పూడిపోయినచెరువు కాలువ:
అయోధ్య నగర్ కాలనీ ఏర్పాటు అయినప్పటినుండి మేము ఇక్కడే ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్నాము ప్రతి ఏటా వర్షం వచ్చే ఎర్రకుంట చెరువు నిండి వరద వచ్చినప్పుడు ఈ చెరువు కాలువ వెంట నీరు ఈ కాలనీ పక్క నుండి వెళుతుంది కానీ ఈ కాలువ పూడిపోయి కాలువలో ముళ్ళ చెట్లు జమ్ము మొలవడం పట్ల చెరువు నీరంతా బయటకు వచ్చి ఇళ్ల చుట్టూ చేరుతుంది సంబంధించిన అధికారులు స్పందించి వర్షాకాలం సమీపకముందే ముందస్తుగా ఈ చెరువు కాలవ పూడిక ముళ్ళ చెట్లు, జమ్మూ తీసివేస్తే బాగుంటుంది.
నాగరాజు గోపాలపేట
ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే పనులు చేపడుతాం
గత ప్రభుత్వాలు నిధులు మంజూరు చేయలేక ఆ అయోధ్య నగర్ కాలనీలో ఏ పనులు చేయలేక పోయాం అక్కడ కావలసినవి మేజర్ సమస్యలు మురుగు కాలువలు సిసి రోడ్లు వీధిలైట్లు ఏర్పాటు ఉంది ఇప్పటి ప్రభుత్వం అయినా ఏమైనా నిధులను మంజూరు చేస్తే ఈ కాలనీలో ముందస్తుగా పనులు చేపట్టి ఆ కాలనీ వాళ్లకు సమస్య లేకుండా చూస్తాం. గతంలో కూడా ఇండ్ల చుట్టూ నీరు చేరి ప్రజలు బయటకు రాలేని పరిస్థితి ఉంటే తాత్కాలికంగా నీటిని తొలగించడం జరిగింది.
బాలరాజు గ్రామ పంచాయతీ కార్యదర్శి