14-07-2025 01:24:49 AM
మునుగోడు,జూన్ 13 : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలపడంపై హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని,పిసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను జూబ్లిహిల్స్ లోని వారి నివాసంలో బిసి యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పానగంటి విజయ్ గౌడ్ కలిసి కృతజ్ఞతలు తెలిపి మాట్లాడారు.
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో బిసి ప్రతినిధుల,వివిధ సంఘాల బీసీ నాయకులు ముఖ్యమంత్రి , పీసీసీ అధ్యక్షుడు లను కలిసి అభినందించడం జరిగింది అని అన్నారు. కార్యక్రమంలో బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూడిద మల్లికార్జున్ యాదవ్ తదితర బిసి నేతలు ఉన్నారు.