16 April, 2026 | 11:00 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

నిరుద్యోగ కళాకారులకు న్యాయం చేయాలి

03-04-2025 02:54 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న నిరుద్యోగ కళాకారులకు సాంస్కృతిక సారథి లో ఉద్యోగాలు కల్పించాలని  నిరుద్యోగ కళాకారులు  కోరారు . గురువారం జిల్లా కేంద్రంలోని కోట్నాక భీమ్ రావు చిల్డ్రన్ పార్క్ లోని తెలంగాణ అమర వీరుల స్తూపం వద్ద నివాళులర్పించి మాట్లాడారు. ఇటీవల సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు,మెదక్ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి  నిరుద్యోగ కళాకారుల పక్షాన తమ గలాన్ని వినిపించినందుకు కృతజ్ఞతలు  తెలిపారు.  మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ కళాకారులకు ఉద్యోగాలు కల్పించి ఆదుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో కళాకారుల పాత్ర ఎనలేనిదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైన సాంస్కృతిక సారథిలో నిరుద్యోగ కళాకారులకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో నిరుద్యోగ కళాకారుల సంఘం అధ్యక్షురాలు సంధ్య, డోంగ్రి సంతోష్, మేడి కార్తీక్, సమ్మక్క, రణధీర్ ఆర్యన్, రాథోడ్  ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.