calender_icon.png 22 June, 2025 | 2:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైల్వే వంతెన నిర్మాణంలో ఇల్లు కోల్పోతున్న వారికి సరైన న్యాయం చేయాలి

20-06-2025 12:00:00 AM

ఘట్ కేసర్, జూన్ 19 : ఘట్ కేసర్ పట్టణంలో చేపట్టిన రైల్వే వంతెన నిర్మాణంలో ఇండ్లు కోల్పోతున్న వారికి అదేవిధంగా కోర్టుకు వెళ్లిన 11 మందికి సరైన న్యాయం చేయాలనే ఆలోచనతో గురువారం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్డిఓ ఉపేందర్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జి తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, మాజీ జెడ్పి చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, మాజీ చైర్మన్ ముల్లి పావని జంగయ్యయాదవ్, మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్, బీబ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్, మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరియాదవ్, హెచ్ ఆర్ డి సి ఈఈ, డిఈ, ఆర్ అండ్ బి ఈఈ, తహసిల్దార్ రజని, మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షుడు ముత్యాలు యాదవ్, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

ఈసందర్భంగా మాజీ చైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ మాట్లాడుతూ ఘట్కేసర్ మున్సిపల్ పట్టణ పరిధిలో జరుగుతున్న రైల్వే వంతెన నిర్మాణంలో ఇండ్లు కోల్పోతున్న వారికి అదేవిధంగా కోర్టుకు వెళ్లిన 11 మంది బాధితులకు సరైన న్యాయం చేయాలని రైల్వే వంతెన నిర్మాణనికి సంబందించిన ఉన్నత అధికారులను పిలిచి కోరడం జరిగిందన్నారు. అలాగే రూ. 30 కోట్ల నిధులతో శివారెడ్డిగూడ నుండి మాధవ రెడ్డి వంతెన వరకు 100 ఫీట్ల రోడ్డు ఏర్పాటు చేయుటకు హెచ్ ఆర్ డి సి వారికీ టెండర్ రావడం జరిగిందని, మున్సిపల్ కమిషనర్ తో ఆర్డిఓతో ప్రజల తరపున వారికి న్యాయం చేయాలని కోరడం జరిగింది.

దీనికి సానుకూలంగా ఆర్డీవో , హెచ్ ఆర్ డి సి, మున్సిపల్ కమిషనర్, కాంగ్రెస్ ఇంచార్జి వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వారం రోజుల లోపు సర్వే చేసి నిర్ణయం తీసుకుంటామని తెంపినట్లు చెప్పారు. ఈకార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కడపోల్ల మల్లేష్ , మాజీ వార్డు సభ్యులు దేవేందర్, డీసీసీ కార్యదర్శి ఆంజనేయులు, కీసర ఆలయ ధర్మకర్త సామల అమర్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బొక్క సంజీవ్ రెడ్డి , నాయకులు బొక్క సత్తి రెడ్డి, శివరాత్రి సురేష్ , మరియు ఎలక్టికల్ డిపార్ట్మెంట్ అధికారులు, వివిధ హోదాలో ఉన్న నాయకులు తదితరులు పాల్గొన్నారు.