20-06-2025 12:00:00 AM
కేర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఆరోగ్యంపై అవగాహన
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 19 (విజయక్రాంతి): ది పవర్ ఆఫ్ ప్రచారంలో భాగంగా కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్, పంజాగుట్ట జంక్షన్లో గురువారం అత్యవసర పరిస్థితుల్లో ప్రతిక్షణం అమూల్యమని గుర్తుచేస్తూ వాహనదారులకు అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో సమయానికి చికిత్స తీసుకోవడం ఎంత ముఖ్య మో తెలియజేశారు. అలాగే ప్రాణాలను రక్షించేందుకు కేర్ హాస్పిటల్స్ దృఢమైన నిబద్ధతను వెల్లడించారు.
ఈ మేరకు కేర్ హాస్పిటల్స్ బృందం సకల చికిత్స, నమ్మకమైన నిపుణులు, అత్యవసర సమన్వయ సేవ అనే ప్లకార్డులతో జంక్షన్ వద్ద నిలబడి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ ప్రచారంలో భాగంగా కేర్ హాస్పిటల్స్ మూడు ముఖ్యమైన హామీలను ప్రజలకు అందించింది.
ప్రతి అత్యవసర కాల్ను మూడో రింగులోపు తీసుకుంటారు, హైదరాబాద్లో ఎక్కడైనా 30 నిమిషాల్లో అంబులెన్స్ చేరుతుంది, బంజారాహిల్స్, హైటెక్ సిటీ, నాంపల్లి, మలక్పేట, ముషీరాబాద్లో ఉన్న కేర్ హాస్పిటల్స్ ఎమర్జెన్సీ విభాగాల్లో డాక్టర్లు వెంటనే సేవలు అందిస్తారు. అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేర్ హాస్పిటల్స్ సీఎంఎస్వో శలభ్ డాంగ్ మాట్లాడుతూ.. అత్యవసర సమయంలో వేగంగా స్పందించడం, సమష్టిగా పనిచేయడం వల్లే ప్రాణాలు రక్షించగలుగుతామన్నారు.