03-06-2025 12:04:10 AM
విద్యార్థులకు జాతీయ స్థాయి ర్యాంకులు
హైదరాబాద్, జూన్ 2 (విజయక్రాంతి): నిజామాబాద్ ప్రగతి నగర్లోని కాకతీయ ఇనిస్టిట్యూషన్ విద్యార్థులు సోమవారం విడుదలైన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో మొదటి ప్రయత్నంలోనే జాతీయ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించారని విద్యాసంస్థల చైర్పర్సన్ సీఎహెచ్ విజయలక్ష్మి తెలిపారు.
వారిలో సాయి సర్వజిత్ేొ347వ ర్యాంకు, ఎల్ శివగే ఎం సంకీర్త్ 6383, జీ వేదాక్షర్ ర్యాంకులు సా ధించారు. వారిని చైర్పర్సన్ విజయలక్ష్మి, ఐఐటీ, నీట్, ఎంసెట్ అకెడమిక్ డైరెక్టర్ సీహెచ్ రామోజీరావు, డైరెక్టర్ సీహెచ్ తేజస్విని అభినందించారు.
ఈ సందర్భంగా వా రు మాట్లాడుతూ.. తమ విద్యార్థులు రాష్ట్రస్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించడం గర్వంగా ఉన్నదన్నారు. ఈ ఫలితాలు సాధించడానికి ప్రత్యేక ప్రణాళిక, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, యాజమా న్యం నిరంతర పర్యవేక్షణ కారణమైందని చెప్పారు. విద్యార్థులను అభినందించిన వారి లో ప్రిన్సిపాల్ సందీప్ కులకర్ణి, వైస్ ప్రిన్సిపాల్ విధితగౌడ్, శ్యామ్, జ్యోష్న, అధ్యా పకులు ఉన్నారు.