03-06-2025 12:02:49 AM
రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందు నిలబెడతాం
ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్రావు
మంచిర్యాల, జూన్ 2 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఒక విజన్తో ముందుకు తీసుకెళ్తుందని తుందని ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్రావు అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం మంచిర్యాల కలెక్టరేట్లో నిర్వహించిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఎగురవేసి, మాట్లాడారు.
సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్లో పేదల సంక్షేమం, సమగ్ర పాలసీల రూపకల్పన, ప్రపంచ స్థాయి ఇన్ఫ్రాడెవలప్మెంట్, పారదర్శక సుపరిపాలన లక్ష్యాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారని చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టిందని తెలిపారు.
తెలంగాణ సమగ్ర అభివృద్ధికి వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్ పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీ, ఇన్ఫ్రా అండ్ ఇండస్ట్రియల్ పాలసీ, టూరిజం పాలసీలను ప్రభుత్వం సిద్ధం చేసిందన్నారు. బ్యాంకు లింకేజీ ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆర్థిక చేయూత అందించి ప్రోత్సహిస్తున్నామన్నారు. విద్య, వైద్యం, రోడ్లు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల అభివృద్ధికి నిధులు నిధులు మంజూరు చేశామన్నారు.