calender_icon.png 17 October, 2025 | 2:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదలకు వరం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్

17-10-2025 12:39:50 PM

నియోజకవర్గ పరిధిలోని 105  చెక్కుల పంపిణీ

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్ చెరు:  కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్  పథకాలు నేడు నిరుపేదలకు వరంగా మారాయని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం పటాన్ చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గం పరిధిలోని అమీన్ పూర్, రామచంద్రపురం, గుమ్మడిదల, జిన్నారం, పటాన్ చెరు రెవెన్యూ మండలాల పరిధిలోని 105 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా మంజూరైన ఒక కోటి  5  లక్షల రూపాయల విలువైన చెక్కులను ఎమ్మెల్యే జిఎంఆర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని తెలిపారు. దళారుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు.