14-06-2025 05:28:23 PM
బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) బాన్సువాడ మండలంలోని బొర్లం గ్రామంలో శనివారం బ్రహ్మ కమలం మొక్కకు పువ్వులు వికసించాయి. వాటికి గ్రామస్థులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మొక్క త్రయం బకేశ్వర్ ఆలయం మహారాష్ట్ర నాసిక్ నుండి తీసుకువచ్చి తమ ఇంట్లో పెంచుకున్నట్లు రాజిరెడ్డి తెలిపారు. సంవత్సరం లో కేవలం ఒకే రోజు రాత్రి వేళలో వికసించి నాలుగు గంటలే ఉండి ముడుచుకు పోతుందనీ తెలిపారు. దీనికి ప్రజలు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం గ్రామం లో గల మఠం లోని శివాలయం లో దేవునికి సమర్పిస్తామని వారు తెలిపారు. ఈ పువ్వు వికసించినప్పుడు పూజలు చేసి కోరికలు కోరితే నెరవేరుతాయని నమ్ముతున్నారు.