కందనూలు ఎంపీ బరిలో బర్రెలక్క

24-04-2024 01:09:43 AM

l స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు  

నాగర్‌కర్నూల్ ఏప్రిల్ 23 (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ పార్లమెం ట్ స్థానానికి బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష స్వతంత్ర అభ్యర్థిగా మంగళవారం నామినేషన్ దాఖలు చేశా రు. నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండల మర్రికల్ గ్రామానికి చెంది న శిరీష..  ‘హాయ్ ఫ్రెండ్స్.. బర్రెలు కాయడానికి వచ్చిన ఫ్రెండ్స్’ అం టూ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలి సిందే. నిరుద్యోగుల తరఫున గత అ సెంబ్లీ ఎన్నికల్లోనూ ఆమె కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి బరిలో దిగి రాష్ట్రాన్ని తనవైపు తిప్పుకొన్నది. ఆ ఎన్నికల్లో అన్ని పార్టీల నేతల నుంచి బెదిరింపులు ఎదుర్కొని మేధావులు, సోషల్‌మీడియా, ప్రజల సహకారంతో భారీగానే ఓట్లను సాదించిం ది. తన భర్త వెంకటేశ్, కుటుంబ సభ్యులతో కలిసి బర్రెలక్క నామినేషన్ దాఖలు చేశారు. తన వద్ద డబ్బు లేకపోయినా ప్రజలకు సేవచేయాలనే సంకల్పం ఉన్నదని.. ప్రశ్నించేవా రిని పార్లమెంటులోకి పంపించాలని ప్రజలకు విజ్ఞప్తిచేశారు.