l రుణమాఫీ విషయంలో సర్కార్ మాట తప్పింది..
l ఎన్నికల హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ విఫలం
l మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి
నల్లగొండ, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): లోక్సభ ఎన్నికల్లో నల్లగొండలో గెలిచి గులాబీ జెండా ఎగురవేస్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి అన్నారు. నల్లగొండలో మంగళవారం ఆయన బీఆర్ఎస్ శ్రేణుల తో భారీ ర్యాలీ నిర్వహించి, అనంతరం ఎంపీ అభ్యర్థితో కంచర్ల కృష్ణా రెడ్డి నామినేషన్ వేయించారు. అనంతరం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో జగదీష్రెడ్డి మాట్లాడారు. రైతు రుణమాఫీ విషయం లో కాంగ్రెస్ ప్రభుత్వం పూటకో మాట మారుస్తున్నదని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందన్నా రు. సీఎం రేవంత్రెడ్డి అబద్ధాలాడుతూ కాలం వెళ్లదీస్తున్నారని మం డిపడ్డారు. సాగర్ జలాలు ఆంధ్రాకు తరలిపోతుంటే జిల్లా మంత్రులు చూస్తూ ఉండిపోతున్నారని ఆరోపించారు. ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ప్రజలు ఎన్నికల్లో గెలిపిస్తే నల్లగొండ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.