13-07-2025 06:59:17 PM
బీజేపీ నాయకురాలు కృష్ణప్రియ మల్లారెడ్డి..
మేడ్చల్ అర్బన్: ఆడపిల్లల ఆత్మరక్షణకు కరాటే అవసరమని బీజేపీ నాయకురాలు కృష్ణప్రియ మల్లారెడ్డి(BJP leader Krishna Priya Malla Reddy) అన్నారు. ఆదివారం మేడ్చల్ కెఎల్ఆర్ లోని జేవియర్ ఫంక్షన్ హాల్ లో టైక్వాండో బెల్ట్ టెస్ట్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కృష్ణప్రియ మల్లారెడ్డి మాట్లాడుతూ.. ఆడపిల్లలు తమని తాము రక్షించుకోవడానికి టైక్వాండో లాంటి శిక్షణను తప్పనిసరిగా నేర్చుకోవాలన్నారు. బెల్ట్ టెస్టులో ప్రమోషన్ పొందిన పిల్లలకు తన చేతుల మీదుగా బ్రౌన్స్, సిల్వర్, గోల్డ్ పతకాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్, ఉమా నగర్, కొంపల్లి తదితర ప్రాంతాల నుంచి క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కరాటే మాస్టర్లు నాగరాజు, శ్రీనివాస్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.