26-07-2024 09:37:20 AM
న్యూఢిల్లీ: నేడు కార్గిల్ 25వ విజయ్ వివస్ వేడుకలు నిర్వహిస్తున్నారు. 1999లో పాకిస్థాన్ తో జరిగిన కార్గిల్ యుద్ధంలో భారత్ విజయం సాధించింది. దీంతో శుక్రవారం దేశవ్యాప్తంగా కార్గిల్ విజయ్ దివస్ వేడులు జరుపుకుంటున్నారు. ఉదయం 9.20 గంటలకు ద్రాస్ లోని కార్గిల్ యుద్ధ స్మారకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ సందర్శించనున్నారు. కార్గిల్ యుద్ధ వీరులకు ప్రధాని మోడీ నివాళులర్పించనున్నారు. షిన్ కుల్ లా సొరంగం పనులను మోడీ వర్చువల్ గా ప్రారంభించనున్నారు. లెహ్ కు కనెక్టివిటినీ పెంచే ముఖ్యమైన ప్రాజెక్టు. నిము- పాడుమ్-దుర్చా రహదారిపై 15,800 అడుగుల ఎత్తు, 4.1 కిలో మీటర్లు మేర ట్విన్-ట్యూబ్ సోరంగం నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రతికూల పరిస్థితుల్లోనూ లెహ్ కు చేరుకోవచ్చు. ప్రాజెక్టు పూర్తయితే ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న సొరంగంగా రికార్డు నెలకొననుంది,