21-06-2025 02:34:43 AM
జిల్లా వ్యవసాయాధికారి విజయనిర్మల
మహబూబాబాద్ జూన్ 20 (విజయ క్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు భరోసా పథకంలో మహబూబాబాద్ జిల్లాలోని 18 మండలాలకు చెందిన 1,93,851 మంది రైతులకు ఎకరానికి 6వేల చొప్పున ఇప్పటివరకు 202.49 కోట్ల రూపాయలు జమ చేసినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయనిర్మల తెలియాలి. శుక్రవారం కలెక్టరేట్ లో డిపిఆర్ఓ రాజేంద్రప్రసాద్, వ్యవసాయ శాఖ ఏడిఏలు శ్రీనివాసరావు, మురళిలతో కలిసి ఆమె విలేకరులతో మాట్లాడారు.
జిల్లాలో రైతులకు రైతు భరోసా పథకం క్రింద 2025 వానాకాలం సీజనుకు గాను 20వ తేదీ వరకు 202.49 కోట్లు, 1,93, 851 మంది రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు. ఇందులో 22, 108 మంది ఆర్ ఓ ఎఫ్ ఆర్ రైతులకు 30.24 కోట్లు రూపాయలు పెట్టుబడి సహాయం అందించడం జరిగిందని చెప్పారు.
ప్రభుత్వం అందించిన పెట్టుబడి సహాయం రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు, కలుపు మందులు కొనుగోలుకు సక్రమంగా వినియోగించుకోవడానికి అందించడం జరిగిందన్నారు. వానాకాలం పంటల సాగుకు ముందే రైతులకు రైతు భరోసా పెట్టుబడి సాయం దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.