31-05-2025 12:15:45 PM
బీఆర్ఎస్ లో చార్ పత్తా ఆట నడుస్తోంది
కల్వకుంట్ల సినిమాకు ప్రొడక్షన్ చేస్తున్నది కాంగ్రెస్
హైదరాబాద్: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(BRS MLC Kalvakuntla Kavitha) వ్యవహారం అంతా ఫ్యామిలీ డ్రామా అని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్(Union Minister Bandi Sanjay Kumar) శనివారం ఆరోపించారు. కరీంనగర్లో బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో కల్వకుంట్ల ఆర్ట్స్ క్రియేషన్ జరుగుతోందని విమర్శించారు. బీఆర్ఎస్ లో చార్ పత్తా ఆట నడుస్తోందని చమత్కరించారు. కల్వకుంట్ల సినిమాకు ప్రొడక్షన్ చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ(Congress party) అంటూ సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ-బీఆర్ఎస్ ఎప్పుడూ కలవవని కేంద్రమంత్రి తేల్చిచెప్పారు. లిక్కర్ కేసులో కవిత అరెస్టు జరగకుండా ఉండేందుకు బీజేపీతో కలిసేందుకు ప్రయత్నించారు.. అవినీతి బీఆర్ఎస్ ను బీజేపీ కలుపుకోదని సంజయ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్- బీఆర్ఎస్ పార్టీలు మాత్రమే కలిసి పని చేశాయని సూచించారు.
రాజన్న గోశాలలో కోడెలు(Vemulawada Rajanna Goshala) చనిపోవడం బాధాకరం అన్నారు. కోడెల మృత్యువాతపై ఆలయ ఈవోతో మాట్లాడతానని బండి సంజయ్ తెలిపారు. కోడెల సంఖ్యకు అనుగుణంగా గోశాలను విస్తరించాలని సూచించారు. రాజన్న ఆలయం నిధులను మాజీ ముఖ్యమంత్రి వేరోచోట ఖర్చ చేశారని ఆయన ఆరోపించారు. మన సైన్యం ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు. పాకిస్థాన్ యుద్ధం ఆగిపోయిందని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడా చెప్పలేదు.. యుద్ధం ఇంకా కొనసాగుతోందని ప్రధాని మోదీ చెప్పారని బండి సంజయ్ వివరించారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించేవరకు యుద్ధం కొనసాగుతుందని చెప్పారని ఆయన పేర్కొన్నారు.