05-06-2025 12:05:58 AM
- రాజకీయ ఉనికి కోసమే కేసీఆర్కు కవిత లేఖ: మంత్రి పొన్నం
- మంత్రులతో ముఖాముఖిని పరిశీలించిన మీనాక్షినటరాజన్
హైదరాబాద్, జూన్ 4 (విజయక్రాంతి): ఎమ్మెల్సీ కవిత, బీఆర్ఎస్ పంచాయితీ టీ కప్పులో తుఫాన్ లాంటిందని మంత్రి పొ న్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కవిత రాజకీయ ఉనికి ప్రశ్నార్థకంగా మారడంతో నే.. ఆమె తన తండ్రి కేసీఆర్కు లేఖ రాసింద ని తెలిపారు. బుధవారం గాంధీభవన్లో మంత్రులతో ముఖాముఖిలో పాల్గొన్న మంత్రి పొన్నం మీడియాతో మాట్లాడారు.
బీఆర్ఎస్లో దెయ్యాలు ఉన్నాయని చెప్ప డం ఎంతవరకు వస్తవమనేది తమకు తెలి యదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ విచారిస్తుందని, కమిషన్ పిలిస్తే ఎవరైనా విచారణకు హాజరుకావాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రాజెక్టు పేరుతో బీఆర్ఎస్ నేతలు కమీషన్లు దండుకున్నారని ఆరోపించారు.
ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఉందని, అందుకే గాంధీభవన్ లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతీ దరఖాస్తును ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని, సమస్య పరిష్క రిస్తామని హామీ ఇచ్చారు. 110 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఈ దరఖాస్తుల్లో ప్రధానంగా భూ సమస్యలను పరిష్కరించాలని అధికం గా వచ్చాయి. మంత్రులతో ముఖాముఖి కార్యక్రమాన్ని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమా ర్గౌడ్ పరిశీలించారు.