23-08-2025 12:25:48 AM
హీరో విశాల్ చివరగా ‘మదగదరాజ’ తో అలరించా రు. అందులో హీరోయిన్లు అంజలి, వర లక్ష్మీశరత్కుమా ర్లతో కలిసి అలరించారాయన. ఇప్పుడు తన 35వ సినిమాను పట్టాలెక్కించాడు. ఈ సినిమాలో అంజలి భాగమైంది. మేకింగ్ టైటిల్ ‘విశాల్35’తో ప్రచారంలో ఈ ప్రాజెక్టును టాలీవుడ్ నిర్మాత ఆర్బీ చౌదరి సొంత బ్యానర్ సూపర్ గుడ్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. అంజలి ప్రస్తుతం చాలా సెలెక్టివ్గా పాత్రలను ఎంచుకుంటున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ‘విశాల్ 35’ ప్రాజెక్టును ఓకే చేసిందీ ముద్దుగుమ్మ. ఈ మేరకు ‘విశాల్ 35’లో అంజలి కీలక పాత్ర పోషించనుందని టీమ్ వెల్లడించారు. రవి అరసు దర్శకుడు. షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. విశాల్ సరసన కథానాయికగా దుషార విజయన్ నటించనున్న ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్ కుమార్; డీవోపీ: రిచర్డ్ ఎం నాథన్; ఎడిటర్: ఎన్బీ శ్రీకాంత్; ఆర్ట్: దురైరాజ్.